నిరాశ్రయుల సేవలో తెలుగు మహిళలు
ABN , First Publish Date - 2021-05-17T06:10:30+05:30 IST
కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆకలితో అలమ టిస్తున్న నిరాశ్రయులు, యాచకులకు టీడీపీ అనంతపురం నియోజకవర్గ శ్రేణులు కడుపు నింపు తున్నారు.
అనంతపురం వైద్యం, మే16: కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆకలితో అలమ టిస్తున్న నిరాశ్రయులు, యాచకులకు టీడీపీ అనంతపురం నియోజకవర్గ శ్రేణులు కడుపు నింపు తున్నారు. వారు ఆదివారం ఐదో రోజు కూడా నగరంలో కలియతిరుగుతూ అన్నం ప్యాకెట్లు అందిస్తున్నారు. తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు విజయశ్రీ, రాష్ట్ర కార్యదర్శి స్వప్న, మనెమ్మ, టీడీపీ నాయకులు వెంకటేష్గౌడ్, దేవళ్ల మురళి, వెంకటకృష్ణ, శ్రీవర్ధన, రవికుమార్గౌడ్, బాషా తదితరులు అరవింద్నగర్, అంబేడ్కర్నగర్, కోర్టురోడ్డు, రైల్వేస్టేషన ప్రాంతాల్లో తిరుగుతూ అన్నం, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు అందజేశారు.