తెలుగు నృత్య కళాకారిణికి బ్రిటన్‌లో అపూర్వ పురస్కారం..!

ABN , First Publish Date - 2021-10-04T02:55:03+05:30 IST

నృత్యంలో విశేష కృషి చేసిన తెలుగు కళాకారిణి రాగసుధా వింజమూరిని బ్రిటన్ ప్రభుత్వం బ్రిటీష్ సిటిజన్ అవార్డుతో సత్కరించింది.

తెలుగు నృత్య కళాకారిణికి బ్రిటన్‌లో అపూర్వ పురస్కారం..!

ఇంటర్నెట్ డెస్క్:  నృత్యంలో విశేష కృషి చేసిన తెలుగు కళాకారిణి రాగసుధా వింజమూరిని బ్రిటన్ ప్రభుత్వం బ్రిటిష్ సిటిజన్ అవార్డు(బీసీఏ)తో సత్కరించింది. బ్రిటన్‌ పార్లమెంటులోని పెద్దల సభలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్య, వైద్యం, సేవాకార్యక్రమాలు, పారిశ్రామిక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారిని బ్రిటన్ ప్రభుత్వం ప్రతి ఏటా బీసీఏ మెడల్స్‌తో సత్కరిస్తుంది. ఈ ఏడాది బ్రిటన్‌లో మొత్తం 26 మంది బీసీఏ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే.. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు మహిళ రాగసుధ కావడం విశేషం. తనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై రాగసుధ హర్షం వ్యక్తం చేశారు. తనకు విద్యనేర్పిన గురువులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వివిధ సామాజిక, కళాత్మక, పర్యావరణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నృత్యం ఓ ప్రభావశీలమైన విధానమని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-04T02:55:03+05:30 IST