ఆదివాసీ కళలపై తెలుగు వర్శిటీ పీఠం

ABN , First Publish Date - 2021-02-23T06:13:32+05:30 IST

తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌లో ‘శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ కొనసాగుతున్నది...

ఆదివాసీ కళలపై తెలుగు వర్శిటీ పీఠం

తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌లో ‘శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ కొనసాగుతున్నది. ఈ విశ్వవిద్యాలయంలో పనికి వచ్చే కోర్సులు ఆంధ్రలోని రాజమండ్రిలో పెట్టి, తెలంగాణ ప్రజల కళలు, సంస్కృతి ప్రతిబింబించని కోర్సులు మృదంగం, భరతనాట్యం, లలిత సంగీతం వంటి కోర్సులు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడి సంస్కృతికి సంబంధం లేని, ఇక్కడివారికి ఏమాత్రం ఉపయోగపడని కోర్సులు కొనసాగించే బదులు ఆదిలాబాద్‌లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆదివాసులకు సంబంధించిన కళలు, సాహిత్యాన్ని అభివృద్ధిపర్చాలి. గోండులకు ప్రత్యేకమైన సంగీతం విభిన్న సంగీత పరికరాలున్నయి. ఏనాడు ఏ యూనివర్శిటీ వీటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వీటిపై అధ్యయనం కూడా చేయలేదు. ఆదివాసీ గోండు కళాకారుడు కనకరాజు గుస్సాడి నృత్యంలో పద్మశ్రీ పొందడం గర్వించదగ్గ విషయం. ఆ నృత్యానికి అంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఆ కళ అంతరించిపోకుండా ఉండాలంటే విశ్వవిద్యాలయం పీఠం అవసరం ఎంతైనా ఉన్నది. అందువల్ల తెలంగాణ ఆదివాసీ సంస్కృతి, కళలు, భాషలను బతికించుకోవడానికి, పరిశోధనలు చేయడానికి ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా అధ్యయన వేదిక డిమాండ్ చేస్తున్నది.

బి.వేణుగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్‌

Updated Date - 2021-02-23T06:13:32+05:30 IST