ఢిల్లీలో చిక్కుకున్న విద్యార్థులు.. స్పందించిన టి.సర్కార్

ABN , First Publish Date - 2020-04-08T14:43:51+05:30 IST

ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు బిడ్డల బాధలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏబీఎన్ కథనం చూసిన వెంటనే తెలంగాణ విద్యార్థినీ విద్యార్థులకు అధికారులు ఫోన్ చేసి మాట్లాడారు.

ఢిల్లీలో చిక్కుకున్న విద్యార్థులు.. స్పందించిన టి.సర్కార్

హైదరాబాద్: ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు బిడ్డల బాధలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏబీఎన్ కథనం చూసిన వెంటనే తెలంగాణ విద్యార్థినీ విద్యార్థులకు అధికారులు ఫోన్ చేసి మాట్లాడారు. ఎంతమంది ఉన్నారో చెప్పాలని, బస్సుల్లో తీసుకుకెళ్తామని భరోసా ఇచ్చారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు. ఏపీకి చెందిన విద్యార్థులంతా 16వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండాలని ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అధికారుల స్పందన గురించి చెప్పినా ఏపీ అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆంధ్రాకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2020-04-08T14:43:51+05:30 IST