America లో తెలుగు విద్యార్థిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-11T13:12:46+05:30 IST

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం చెందాడు. మిస్సోరి రాష్ట్రం వారెన్స్‌బగ్‌లో ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కొడుకు..

America లో తెలుగు విద్యార్థిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

మిర్యాలగూడ, మే 10: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం చెందాడు. మిస్సోరి రాష్ట్రం వారెన్స్‌బగ్‌లో ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి కిరణ్‌రెడ్డి(25) ఎంఎస్‌ చదివేందుకు గత ఏడాది వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్‌ యూనివర్సిటీకి వెళ్లాడు. ఈ నెల 7వ తేదీన రాత్రి 7.30 గంటలకు స్నేహితులతో కలిసి వెళ్తుండగా వీరి కారును ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. డ్రైవర్‌ పక్కనే కూర్చున్న కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి బావమరిది మంగళవారం సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసింది. క్రాంతికిరణ్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి 2, 3 రోజుల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బంధువులు తెలిపారు. 

Read more