తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2021-12-17T13:32:05+05:30 IST

తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.9, విశాఖ జిల్లా మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. తీవ్రమైన చలితో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2021-12-17T13:32:05+05:30 IST