ధాన్యం బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-06-20T03:24:07+05:30 IST
ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తిరుపతి, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని తెలుగురైతు నాయకులు, రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా చేశారు.
కలెక్టరేట్ ఎదుట తెలుగురైతు నాయకుల ధర్నా
నెల్లూరు(హరనాథపురం), జూన్ 19 : ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తిరుపతి, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని తెలుగురైతు నాయకులు, రైతులు కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, నెల్లూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు రావూరి రాధాకృష్ణ నాయుడు, నెల్లూరు ప్రభాకర్నాయుడు, శ్రీహరి, మేదరమెట్ల కోదండరామ నాయుడు, రమేష్ నాయుడు, ఏలూరి కృష్ణారెడ్డి, మునుస్వామి, రవికుమార్, నాగార్జునరెడ్డి, చెండి రమణయ్య, పెంచల భాస్కర్రెడ్డి, ఎన్.రమేష్, ఎల్. ప్రభాకర్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.