మహాకవి గురజాడను స్మరించుకున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-01-16T16:56:23+05:30 IST

కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా విఖ్యాత సాహితీ వేత్త గురజాడ అప్పారావును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

మహాకవి గురజాడను స్మరించుకున్న ప్రధాని మోదీ

ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా విఖ్యాత సాహితీ వేత్త గురజాడ అప్పారావును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. తన ప్రసంగంలో గురజాడ ‘దేశభక్తి’ గేయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ గేయంలోని ‘సొంత లాభం కొంత మానుకొని.. పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న వాక్యాలను వినిపించారు. గురజాడ సిద్ధాంతాన్ని దేశం ఆచరించిందని.. టీకా వచ్చిందని మోదీ అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని, వ్యాక్సిన్‌ వచ్చిందని జాగ్రత్తలు మరిచిపోవద్దని హెచ్చరించారు. టీకా వేసుకున్నా భౌతికదూరం, మాస్క్‌ తప్పనిసరి అన్నారు. 

Updated Date - 2021-01-16T16:56:23+05:30 IST