ఐడాకు ఇద్దరు తెలుగువారు బలి

ABN , First Publish Date - 2021-09-06T16:03:02+05:30 IST

అమెరికాలో ఐడా హరికేన్‌ ఉధృతి కారణంగా పోటెత్తిన వరదల్లో చిక్కుకొని ఇద్దరు తెలుగు వారు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న మాలతి కంచె (46) బుధవారం తన 15 ఏళ్ల

ఐడాకు ఇద్దరు తెలుగువారు బలి

మరో ఇద్దరు భారత సంతతి వారూ మృతి
న్యూయార్క్‌, సెప్టెంబరు 5: అమెరికాలో ఐడా హరికేన్‌ ఉధృతి కారణంగా పోటెత్తిన వరదల్లో చిక్కుకొని ఇద్దరు తెలుగు వారు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న మాలతి కంచె (46) బుధవారం తన 15 ఏళ్ల కూతురుతో కలిసి వాహనంలో ఇంటికి వెళుతుండగా నడుంలోతు వరదలో చిక్కుకున్నారు. వరద తీవ్రత పెరగడంతో ఇద్దరూ ఓ చెట్టును పట్టుకున్నారు. వరద ధాటికి చెట్టు కూలిపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. కూతురికి ఈత రావడంతో బతికింది. మాలతి మృత దేహాన్ని అధికారులు కనుగొన్నారు. గతవారం న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ధనుష్‌ రెడ్డి (31) అనే మరో ప్రవాసీయుడు మురుగునీటి పైపులో పడి చనిపోయారు. న్యూయార్క్‌లో మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా వరదల్లో చిక్కుకొని మృతిచెందారు. 

Updated Date - 2021-09-06T16:03:02+05:30 IST