కువైట్‌లో క‌రోనా కాటుతో తెలుగు ఎన్నారై మృతి !

ABN , First Publish Date - 2020-06-02T16:00:37+05:30 IST

గ‌ల్ఫ్‌లో విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.

కువైట్‌లో క‌రోనా కాటుతో తెలుగు ఎన్నారై మృతి !

కువైట్ సిటీ: గ‌ల్ఫ్‌లో విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ప్ర‌ధానంగా ఈ వైర‌స్ సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లో పంజా విసురుతోంది. కువైట్‌లో శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతున్న కోవిడ్‌-19 కాటుకు తాజాగా ఓ తెలుగు ఎన్నారై బ‌లైయ్యాడు. తెలంగాణ‌లోని నిజామాబాద్‌కు చెందిన ఎన్నారై క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. భీంగ‌ల్ మండ‌లం ప‌ల్లికొండ‌కు చెందిన ఎన్నారై రెండేళ్ల క్రితం వ‌ర్క్ వీసాపై కువైట్ వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల అత‌నికి క‌రోనా సోకింది. దీంతో చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌రలించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మే 28న చ‌నిపోయాడు. సోమ‌వారం కువైట్ అధికారులు మృతుడి కుటుంబ స‌భ్యుల‌కు ఈ విషయాన్ని తెలియ‌జేశారు.     ‌ 

Updated Date - 2020-06-02T16:00:37+05:30 IST