జ్యోతి ప్రజ్వలన చేసిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
ABN , First Publish Date - 2020-04-06T04:07:19+05:30 IST
కరోనాపై పోరులో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళసై, ఏపీ గవర్నర్ హరిచందన్ జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రధాని పిలుపునకు..
హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళసై, ఏపీ గవర్నర్ హరిచందన్ జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రధాని పిలుపునకు ప్రతి స్పందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాంతి వెలుగులతో కరోనా చీకటికి ముగింపు ఖాయమని గవర్నర్ హరిచందన్ చెప్పారు. కరోనా బాధితులను ఆశల తీరం వైపు నడిపించేందుకు వెలుగు దివ్వెలు ఇవి అని ఆయన అన్నారు.