తుపాను పరిహారంలో వివక్ష తగదు

ABN , First Publish Date - 2021-01-14T05:36:13+05:30 IST

తుపాను నష్ట పరిహారం విషయంలో జిల్లాను విస్మరించడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలో భోగి మంటల్లో వ్యవసాయ జీవో ప్రతులను ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో కలిసి దహనం చేశారు. అచ్చెన్నా యుడు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 19 నెలల వైసీపీ పాలనలో అన్ని వ్యతిరేక చర్యలేన న్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి సంబరాలు జరిపి రైతుల్లో ఆనందం నింపామన్నారు. ఐదేళ్ల కాలంలో రైతులకు ఇబ్బందు లు కలుగకుండా చూసుకున్న విషయాన్ని గుర్తుచే

తుపాను పరిహారంలో వివక్ష తగదు
జీవో ప్రతులను దహనం చేస్తున్న దృశ్యం




 జిల్లాను విస్మరించడం దారుణం

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

 నిమ్మాడలో వ్యవసాయ జీవో ప్రతుల దహనం

కోటబొమ్మాళి, జనవరి 13: తుపాను నష్ట పరిహారం విషయంలో జిల్లాను విస్మరించడం దారుణమని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలో భోగి మంటల్లో వ్యవసాయ జీవో ప్రతులను ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో కలిసి దహనం చేశారు. అచ్చెన్నా యుడు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 19 నెలల వైసీపీ పాలనలో అన్ని వ్యతిరేక చర్యలేన న్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి సంబరాలు జరిపి రైతుల్లో ఆనందం నింపామన్నారు. ఐదేళ్ల కాలంలో రైతులకు ఇబ్బందు లు కలుగకుండా చూసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.  పండుగ పూట రైతులకు పస్తులుంచడం వైసీపీ ప్రభుత్వానికి తగదన్నారు. టీడీపీ హయంలో ధాన్యం విక్రయించిన ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేదన్నారు. ప్రస్తుతం నెల రోజులు దాటుతున్నా అతీగ తీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 





Updated Date - 2021-01-14T05:36:13+05:30 IST