మహానాడుకు బయల్దేరిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-05-27T05:45:18+05:30 IST

ఒంగోలులో శుక్ర, శనివారాల్లో జరుగనున్న మహానా డు కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ ఆధ్వర్యంలో గురువారం పలువురు నాయకులు బయల్దేరారు.

మహానాడుకు బయల్దేరిన తెలుగు తమ్ముళ్లు
కదిరి నుంచి మహానాడుకు వెళ్తున్న కందికుంట తదితరులు

కదిరి, మే26:  ఒంగోలులో శుక్ర, శనివారాల్లో జరుగనున్న మహానా డు కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ ఆధ్వర్యంలో గురువారం పలువురు నాయకులు బయల్దేరారు. రెండు హైటెక్‌ బస్సులలో తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు. ఇవే కాక వివిధ వాహనాలలో వందలాదిగా మహానాడుకు తరలి వెళ్లారు.

ధర్మవరం: ఒంగోలులో శుక్ర, శనివారాల్లో జరుగుతున్న టీడీపీ మహానాడుకు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు గురువారం పెద్దఎత్తున తరలివెళ్లారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమాయత్తమై తరలివెళ్లారు. ముఖ్య నాయకులతోపాటు ద్వితీయ శ్రేణి క్యాడర్‌ కూడా వారివారి ప్రత్యేక వాహనాల్లో ఒక రోజు ముందుగానే బయలుదేరివెళ్లడం కనిపించింది. ఇటీవల శ్రీసత్యసాయిజిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో నూతనోత్తేజంతో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడుకు అదే ఉత్సాహంతో తరలివెళ్లారు. 

పుట్టపర్తిరూరల్‌: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగలా జరుపుకునే మహానాడుకు పుట్టపర్తి నుంచి మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు త రలివెళ్లారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి నియోజకవ ర్గంలోని అమడగూరు, నల్లమాడ, ఓడీచెరువు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, పుట్టపర్తి రూరల్‌ నుంచి భారీగా 30 వాహనాల్లో తరలివెళ్లారు.



Updated Date - 2022-05-27T05:45:18+05:30 IST