మహానాడులో ఉత్సాహంగా నాయకులు

ABN , First Publish Date - 2022-05-28T05:07:05+05:30 IST

ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో శుక్రవారం కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మహానాడులో ఉత్సాహంగా నాయకులు
మహానాడులో ఇందుకూరుపేట మండల నాయకులు

 కోవూరు, మే 27 : ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో శుక్రవారం కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నాయకత్వంలో కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల నాయకులు  పెద్దసంఖ్యలో మహానాడులో పాల్గొన్నారు. చేజర్ల వేంకటేశ్వర్లు రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

ఇందుకూరుపేట : ఒంగోలులో ప్రారంభమైన మహానాడుకు శుక్రవారం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్‌, బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. రెండు రోజులపాటు మహానాడులో పాలుపంచుకోవడమే కాకుండా అక్కడ  నేతలు అప్పగించిన పనులను కార్యకర్తలుగా చేసేందుకు కూడా తరలిపోతున్నామని వారు తెలిపారు. మండల నాయకులు వీరేంద్రచౌదరి, మునగాల రంగారావుయాదవ్‌, పేదూరు రామచంద్రయ్య  ఆధ్వర్యాన తరలివెళ్లారు.

రాపూరు : మహానాడులో మండలంలోని తెలుగుతమ్ముళ్లు పాల్గొన్నారు. శుక్రవారం వాహనాల్లో తరలివెళ్లారు. నాయకులు నువ్వుల శివరామకృష్ణ, దందోలు వెంకటేశ్వర్లురెడ్డి,  బొమ్మిరెడ్డి రవీంద్రారెడ్డి, షేక్‌ ముక్తియర్‌, పచ్చిగళ్ల రత్నం ఉన్నారు. రెండురోజుల నుంచే కొండ్లపూడి రాఘవరెడ్డి మహానాడు ఏర్పాట్లలో ఉన్న విషయం తెలిసిందే.

మర్రిపాడు : ఒంగోలులో రెండురోజులపాటు జరుగుతున్న 32వ మహానాడుకు టీడీపీ మండలాధ్యక్షుడు ఆరికట్ల జనార్ధన్‌ నాయుడు ఆధ్వర్యంలో సుమారు యాబై మంది నాయకులు, కార్యకర్తలు,  ఎన్టీఆర్‌ అభి మానులు ప్రత్యేకవాహనాల్లో బయలుదేరి వెళ్లారు. 



Updated Date - 2022-05-28T05:07:05+05:30 IST