‘తెలుగు అమ్మాయి’ షో అదిరింది

ABN , First Publish Date - 2021-04-11T06:30:11+05:30 IST

‘ఓ వైపు పదహారు అణాల తెలుగు అమ్మాయిలు...మరోవైపు చీరకట్టుతో మహి ళలు...ర్యాంపుపై హొయలు ఒలికిస్తూ నడిచి వస్తుంటే... చూడముచ్చటగా ఉన్న ఆ అందాలను తిలకిస్తూ ఆహూ తులు సందడి చేశారు.

‘తెలుగు అమ్మాయి’ షో అదిరింది
తెలుగు మహిళ విజేతలు లీలావతి, లక్ష్మి, ప్రత్యూష, తెలుగు అమ్మాయి విజేతలు దీక్షిత, దివ్యకీర్తన, తేజశ్వని

విశాఖలో ఫైనల్‌ పోటీల్లో సందడే సందడి

ముగ్గురేసి విజేతలు ఎంపిక

డాబాగార్డెన్స్‌ , ఏప్రిల్‌ 10: ‘ఓ వైపు పదహారు అణాల తెలుగు అమ్మాయిలు...మరోవైపు చీరకట్టుతో మహి ళలు...ర్యాంపుపై హొయలు ఒలికిస్తూ నడిచి వస్తుంటే... చూడముచ్చటగా ఉన్న ఆ అందాలను తిలకిస్తూ ఆహూ తులు సందడి చేశారు. స్టేషన్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘తెలుగు అమ్మాయి’ గ్రాండ్‌ ఫినాలేలో పండుగ వాతావరణం నెల కొంది. జడగంటలు సందడి చేస్తుంటే, పాపిడి బిందెలు మెరుస్తుంటే, వడ్డాణాలు, దండ వంకీలు మైమరిపిస్తుంటే, కాళ్లపట్టీలు సవ్వడి చేస్తుంటే చురుకైన చూపు, ఆకట్టుకునే హొయలతో తరలి వస్తున్న పోటీదార్లను చూసి అక్కడివారు మైమర్చి పోయారు. యువతులు, మహిళలు పోటీపడ్డారు. ఈవెంట్‌ డైరెక్టర్‌ వీరుమామ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో మేయర్‌ గొలగాని హరికుమార్‌ ముఖ్య అతిథిగాహాజరై వివిధ రంగాల్లో ప్రతిభకనపర్చిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు.అక్బల్‌, సుజాత, సినీ దర్శకుడు డానీ, హీరోయిన్‌ తేజు, రచన, మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ శోభన, మోడల్‌ సంతోష్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విశాఖ తెలుగుమ్మాయి 2021 విజేతగా దీక్షిత  నిలవగా, దివ్యకీర్తన, తేజశ్వని రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.  తెలుగు మహిళ 2021 విజేతగా లీలావతి నిలవగా, లక్ష్మి, ప్రత్యూష రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Updated Date - 2021-04-11T06:30:11+05:30 IST