కెనడాలో అంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-04-21T23:51:00+05:30 IST

తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలు వైభవంగా జరిగాయి.

కెనడాలో అంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు

టొరంటో: తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలు వైభవంగా జరిగాయి. వర్చువల్ విధానంలో జరిగిన ఈ వేడుకలకు తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కెనడాలో నివసిస్తున్న 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొని విజయవంతం చేశారు.


మొదటగా తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి కుటుంబం జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు. అనంతరం కెనడా, భారతదేశ జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటోలో వున్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి ఫలితాలను చదివి అందరికీ వివరించారు.


తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి మాట్లాడుతూ.. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి కోవిడ్-19 కష్ట కాలంలో తాము చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ చారి సామంతపూడి మాట్లాడుతూ.. కెనడాలో తెలుగు వారందరికీ ఎన్నో సేవలు అందిస్తున్న అల్బెర్టా మంత్రి పాండా ప్రసాద్, సన్ డైన్ అధినేత శ్రీధర్ ముండ్లూరు, టొరంటో తెలుగు టైమ్స్ అధినేత సర్దార్ ఖాన్‌కు ఉగాది పురస్కారాలను ప్రకటించి వారి సేవలను కొనియాడారు.   


తెలుగు సినీ పరిశ్రమకు చెందిన గాయకుడు దినకర్ కల్వల తన గానామృతాన్ని పంచారు. చిన్నారులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టిదామెరశెట్టి, తారుణిదేసు,మేధా గేదెల, శ్రీ వత్స సంక,శ్లోక కేశర్వాణి, అజయ్ అనమంగండ్ల, సంయుతగందె, సాయిశ్రీ పులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్ ముటుపూరుల పాటలు, నృత్యాలు అందరిని ఎంతో ఉత్తేజపరిచాయి. 


ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల  మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, మరియు ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, లోకేష్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్‌ను  తాకా అధ్యక్షులు  శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికి, దాతలకు, అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-04-21T23:51:00+05:30 IST