ఏపీలోను తెలంగాణ తెలుగు అకాడమీ అక్రమార్కులు
ABN , First Publish Date - 2021-10-13T21:37:08+05:30 IST
ఏపీలోను తెలంగాణ తెలుగు అకాడమీ అక్రమార్కులు దోచేశారు. ఏపీలో రెండు ప్రభుత్వ సంస్థల నుంచి సాయి కుమార్ బ్యాచ్ రూ.15 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు.
విజయవాడ: ఏపీలోను తెలంగాణ తెలుగు అకాడమీ అక్రమార్కులు దోచేశారు. ఏపీలో రెండు ప్రభుత్వ సంస్థల నుంచి సాయి కుమార్ బ్యాచ్ రూ.15 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. ఏపీ గిడ్డంగుల శాఖ నుంచి 9.60.కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్డీలు గల్లంతయ్యాయి. భవానిపురం IOB లోని గిడ్డంగుల కార్పొరేషన్ FD నుంచి రూ.9.60.కోట్లు నిందితులు కొట్టేశారు. ఇప్పటికే స్పందించిన బ్యాంక్ ఉన్నతాధికారులు కార్పొరేషన్ అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్పినట్లు సమాచారం. బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయంపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నారు. కృష్ణా జిల్లా లోని సప్తగిరి బ్యాంక్ నుంచి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు చెందిన 5 కోట్ల FD లను కొట్టేశారు.