అసైన్డ్ భూములను లాక్కుంటే చెప్పండి!: భట్టి
ABN , First Publish Date - 2020-09-22T08:31:37+05:30 IST
అసైన్డ్ భూములను లాక్కుంటే చెప్పండి!: భట్టి
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గతంలో పేదలకు అసైన్ చేసిన భూములను ప్రభుత్వం లాక్కుంటే.. సీఎల్పీకి సమాచారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆ భూములను సేకరించింది ప్రజా ప్రయోజనాల కోసం కాకుంటే.. పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడో పేదలకు అసైన్ చేసిన 7,958 ఎకరాల భూమిని ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం పేదల భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. కాగా, 2016 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసి వేశారని భట్టి తెలిపారు. ఇచ్చిన హామీలను అములు చేసి ఉంటే మేనిఫెస్టోను తీసేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.