టీవీ మరింత ప్రియం!

ABN , First Publish Date - 2021-05-05T06:57:44+05:30 IST

టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత పెంచాలని...

టీవీ మరింత ప్రియం!

  • మరో 3-5 శాతం పెరగనున్న ధర

న్యూఢిల్లీ: టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. గత ఏడాది అక్టోబరులో మోదీ సర్కారు ఈ ప్యానెళ్ల దిగుమతిపై 5 శాతం సుంకం విధించింది. ఈ సుంకాన్ని మూడేళ్లలో 10-12 శాతానికి పెంచాలనుకుంటోంది. దేశీయంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధానోద్దేశం. కానీ, కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌లు టీవీ కంపెనీల ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలకు గండికొడుతున్నాయి. దాంతో చాలా కంపెనీలు ఈ ప్యానెళ్ల కోసం ప్రధానంగా చైనా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో టీవీల ధరలు ఇప్పటికే రెండుసార్లు పెరిగాయి. జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి కంపెనీలు ధరలు పెంచాయి.


Updated Date - 2021-05-05T06:57:44+05:30 IST