తెలంగాణ బీజేపీ మహిళానేత కన్నుమూత
ABN , First Publish Date - 2021-06-24T17:25:25+05:30 IST
ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు కె.పద్మమ్మ(65) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె పలు సమస్యలపై డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్ టి.శైలజాగోపాల్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశారు. ఆమె మృతిపట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. బుధవారం సాయంత్రం నారాయణగూడ వైఎంసీఏ సమీపంలో క్రిస్టియన్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.