తెలంగాణ గిరిజన గ్రామాల్లో వసతుల్లేవు: కేంద్రం
ABN , First Publish Date - 2021-10-23T00:06:42+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. తెలంగాణలో చాలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవని కేంద్రం చెప్పింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. తెలంగాణలో చాలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవని కేంద్రం చెప్పింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో గిరిజన గ్రామాల్లోని మౌలిక వసతులపై విశ్లేషించి కేంద్రం ర్యాంకులు ఇచ్చింది. 1,663 గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం నివేదిక ఇచ్చింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి 21-40 శాతం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తమ సదుపాయాల కల్పనలో మహబూబ్నగర్. వసతులు కల్పించని జిల్లాగా ఆదిలాబాద్లకు ర్యాంకులు ఇచ్చారు.