Telanganaలో నిప్పుల కొలిమిలా ఎండలు.. పిట్టల్లా రాలుతున్న జనాలు
ABN , First Publish Date - 2022-05-04T00:25:25+05:30 IST
తెలంగాణలో ఎండలో బెంబేలెత్తిస్తున్నాయి. వడదెబ్బతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హన్మకొండకు ..
హైదరాబాద్: తెలంగాణలో ఎండలో బెంబేలెత్తిస్తున్నాయి. వడదెబ్బతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హన్మకొండకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు జున్ను రాజు గీసకొండలో పని చేస్తూ అస్వస్థతకు గురై మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన సారాంగం వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ వడదెబ్బతో బస్టాండ్లో మృతి చెందారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రాజయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి నాయక్ తండాలో బుజ్జమ్మ ఎండ తీవ్రతో చనిపోయారు.
నాగారం మండలం ఈటూరులో అంజయ్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం రాజులగూడు తండాకు చెందిన కూలీ బాలాజీ వడదెబ్బకు బలయ్యారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదేపాడులో వృద్ధుడు పుల్లయ్య, చింతకాని మండలం గాంధీనగర్కు చెందిన మారెముత్తు ఎండల తీవ్రతతో వడదెబ్బకు లోనై చనిపోయారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.