తెలంగాణ నుంచి పోసానిని బహిష్కరించాలి: శంకర్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-09-30T23:03:55+05:30 IST

దర్శకుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడికి తెలంగాణ జనసేనకు సంబంధం లేదని తెలంగాణ జనసేన ఇంచార్జ్‌ నేమూరి శంకర్‌గౌడ్‌ చెప్పారు.

తెలంగాణ నుంచి పోసానిని బహిష్కరించాలి: శంకర్‌గౌడ్‌

హైదరాబాద్: దర్శకుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడికి తెలంగాణ జనసేనకు సంబంధం లేదని తెలంగాణ జనసేన ఇంచార్జ్‌ నేమూరి శంకర్‌గౌడ్‌ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పోసానిపై పెట్టిన కేసులు తీసుకోకపోవడంపై తమకు అనుమానాలున్నాయని, తెలంగాణలో ఒక పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేదని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్, బీజేపీ నేత బండి సంజయ్, ఎంపీ అసదుద్దీన్‌కు ఇదే జరగొచ్చన్నారు. తెలంగాణ నుంచి పోసాని కృష్టమురళిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోసానిని కంట్రోల్ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. పనికిరాని వ్యక్తికి 300 మంది పోలీస్ సెక్యూరిటీ అవసరమా? అని శంకర్‌గౌడ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2021-09-30T23:03:55+05:30 IST