Telangana సచివాలయం నిర్మాణంలో మరో ముందడుగు
ABN , First Publish Date - 2021-11-25T18:12:10+05:30 IST
తెలంగాణ సచివాలయం నిర్మాణంలో మరో ముందగడు పడింది.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం నిర్మాణంలో మరో ముందగడు పడింది. కాసేపట్లో కొత్త సచివాలయంలో మసీదు నిర్మాణానికి భూమి పూజ జరుగనుంది. హోం మంత్రి మహమూద్ అలీ భూమి పూజ చేయనున్నారు. కొత్త సచివాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో 6 నెలల్లో కొత్త సచివాలయం పూర్తి కానుంది. మసీదు, గుడి, చర్చి నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు మసీదు నిర్మాణం కోసం మహమూద్ అలీ భూమి పూజ చేయనున్నారు.