తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-16T15:11:24+05:30 IST

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ  ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని  ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలకు విద్యాశాఖ సూచించింది. 

Updated Date - 2022-01-16T15:11:24+05:30 IST