అయోధ్య భూమి పూజ ఆహ్వానాన్ని అందుకున్న తెలంగాణ సంగ్రాం మహారాజ్

ABN , First Publish Date - 2020-08-02T19:14:11+05:30 IST

అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగ్రాం మహారాజ్‌కు

అయోధ్య భూమి పూజ ఆహ్వానాన్ని అందుకున్న తెలంగాణ సంగ్రాం మహారాజ్

నారాయణఖేడ్ : అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగ్రాం మహారాజ్‌కు ఆహ్వానం అందింది. ఈయన అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యతల్లో ఉన్నారు. దీంతో పాటు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయ పీఠాధిపతిగా ఉన్నారు. తెలంగాణ నుంచి తనకే ఆహ్వానం అందిందని తెలిపారు. ఈ నెల 3 న హైదరాబాద్ నుంచి బయల్దేరడానికి విమాన టిక్కెట్లను సైతం పంపారని ఆయన వెల్లడించారు.


కరసేవ, రామజ్యోతి, శిలాన్యాస్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 5 జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ ఆనందీబేన్ పటేల్, సీఎం యోగి, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు మరో 50 మంది సాధు సంతులు కూడా హాజరవుతున్నారు. ఈ 50 మంది సాధు సంతువుల్లో సంగ్రాం మహారాజ్ ఒకరు. 

Updated Date - 2020-08-02T19:14:11+05:30 IST