రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

ABN , First Publish Date - 2021-12-05T02:14:53+05:30 IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ర్టాలకు తీరని లోటు అని తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ర్టాలకు తీరని లోటు అని తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నరాజకీయ దురంధురుడు కొణిజేటి రోశయ్య అని అన్నారు. శాసన సభలో బడ్జెట్ 15 సార్లు ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. కొంతకాలం ఎమ్మెల్యేగా ఆయనతో పనిచేసినందుకు తాను గర్వపడుతున్నట్టు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2021-12-05T02:14:53+05:30 IST