అక్కడ హత్య చేసి .. ఇక్కడ లొంగిపోయారు!

ABN , First Publish Date - 2020-03-04T16:17:03+05:30 IST

తూర్ప గోదావరి జిల్లా పెద్దపూడి మండలం జి. మామిడాడలో శనివారం రాత్రి జరిగిన హత్య కేసులో

అక్కడ హత్య చేసి .. ఇక్కడ లొంగిపోయారు!

తూర్ప గోదావరి జిల్లా  పెద్దపూడి మండలం జి. మామిడాడలో శనివారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మామిడాడకు చెందిన మేడిపాటి సూర్యనారాయణ రెడ్డి అనుచరులకు, అదే గ్రామానికి చెందిన కొవ్వూరి  ఇంద్రా రెడ్డి మేనల్లుడు ఆనందరెడ్డికి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో శనినవారం సాయంత్ర ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఇంద్రా రెడ్డి అదే రోజు అర్ధ రాత్రి సమయంలో కొందరు వ్యక్తులతో కలిసి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. తన మేనల్లుడిపై ఎందుకు చేయి చేసుకున్నారంటూ నిలదీశాడు. అతడిపై సూర్య నారాయణ రెడ్డి తో పాటు అతని అనుచరులు ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంద్రారెడ్డి (50) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


ఘటనలో పాల్గొన్న ఆరుగురిలో ఇద్దరు నిందితులు చిక్కువోలుకు చెందిన డేవిడ్ (25), విజయ్ (25) పెద్దపూడి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ప్రధాన నిందితుడైన నడిపిడి సూర్యనారాయణరెడ్డి (28), బీర సాయికుమార్ (22), జంప రాజు (25), మనోజ్ కుమార్ (24) మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఓ ఛానెల్ కార్యాలయంలో లొంగిపోవడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్  ఎస్ఐలు  రాం రెడ్డి, రవి రాజ్‌లు సిబ్బందితో పాటు వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పెదపూడి పోలీసులకు సమాచారమిచ్చారు.

Updated Date - 2020-03-04T16:17:03+05:30 IST