కాశీలో చిక్కుకున్న 60 మంది తెలంగాణ వాసులు
ABN , First Publish Date - 2020-03-26T08:17:07+05:30 IST
కాశీకి వెళ్లిన 60 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడే...
- లాక్డౌన్తో తిరిగి రాలేని పరిస్థితి
- ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
నార్సింగి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కాశీకి వెళ్లిన 60 మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ నెల 13న భక్తుల బృందం రైలుమార్గంలో కాశీ యాత్రకు బయలు దేరింది. 29న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇందులో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ట్యాబ్లెట్లు, డబ్బులు అయిపోయాయని తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించాలని కోరుతున్నారు.