శాంతిభద్రతల పరిరక్షణలో..తెలంగాణ నంబర్‌ వన్‌: అలీ

ABN , First Publish Date - 2022-09-26T08:36:25+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో..తెలంగాణ నంబర్‌ వన్‌: అలీ

పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేశాం: హరీశ్‌రావు

జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 25: శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల కేంద్రంలో రూ.24 కోట్లతో నిర్మించిన పోలీస్‌ కాంప్లెక్సులో ఎస్సై క్వార్టర్‌, డాగ్‌ కన్నెల్‌, ఆఫీసర్స్‌ గెస్ట్‌హౌజ్‌, విశ్రాంతి బ్యారక్స్‌, ఇంటర్నల్‌ సీసీ రోడ్లు, ఆధునిక టెక్నాలజీతో యూపీఎస్‌ సిస్టం, సిబ్బంది క్వార్టర్స్‌, బీడీ టీం భవనాలను మంత్రి హరీశ్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారనే అపోహాను ప్రచారం చేశారని, కానీ ఎనిమిదేళ్లలో అంచనాలను తలకిందులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన చెప్పారు.  మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పోలీస్‌ వ్యవస్థను అన్ని విధాల పటిష్టం చేశామని, సిబ్బందిని నియమించామన్నారు. కొత్త మండలాల్లో పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి, ఫ్రేండ్లీ పోలీసింగ్‌కు కృషి చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-09-26T08:36:25+05:30 IST