ప్రాణహిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ABN , First Publish Date - 2022-01-17T21:38:40+05:30 IST

జిల్లాలోని కోటపల్లి మండలం ఆలుగాంలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రాణ హిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

ప్రాణహిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం  ఆలుగాంలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రాణ హిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన  వంశీ వర్ధన్, విజయేంద్ర సాయి, రాకేష్ గల్లంతయినట్లు గుర్తించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. కుుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-17T21:38:40+05:30 IST