ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన దొంగలు

ABN , First Publish Date - 2022-01-18T02:00:33+05:30 IST

జిల్లాలో ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. రాగన్నగూడా లక్ష్మీ మేఘ టౌన్‌షిప్‌లో 5 ఇండ్లలో దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు.

ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన దొంగలు

రంగారెడ్డి: జిల్లాలో ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు.  రాగన్నగూడా  లక్ష్మీ మేఘ టౌన్‌షిప్‌లో 5 ఇండ్లలో దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు. 5 ఇండ్లలో చోరీ సుమారు 5తులాల బంగారం 20వేల నగదు అపహరిచారు. సంక్రాంతికి ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇండ్లలో దొంగ తనాలు చోటుచేసుకున్నాయి. తాళాలు వేసి న ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు ఈ ఘటనలకు పాల్పడ్డారు. గ్రేటెడ్ కమ్యూనిటీ లో వెనకలో ప్రహరీ గోడ లేక పోవడంతో దొంగ తనాలు జరిగాయని కాలనీ వాసులు అనుమానలు వ్యక్తచేస్తున్నారు. ఈ చోరీలపై విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-18T02:00:33+05:30 IST