దారుణం... నిద్రపోతున్న అన్నపై....
ABN , First Publish Date - 2022-06-25T16:19:02+05:30 IST
దారుణం... నిద్రపోతున్న అన్నపై....
మహబూబాబాద్: జిల్లాలోని రోటిబండ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూ వివాదం తలెత్తింది. ఈకోపంతో రగిలిపోయిన తమ్ముడు గోవర్ధన్ నిద్రపోతున్న అన్న భూక్య వెంకన్న(45)ను గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.