టైర్ పంక్చర్... క్వాలిస్ వాహనం బోల్తా
ABN , First Publish Date - 2022-01-17T21:45:36+05:30 IST
జిల్లాలోని డిండి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ అయ్యి క్వాలిస్ వాహనం బోల్తా పడింది.
నాగర్ కర్నూల్: జిల్లాలోని డిండి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ అయ్యి క్వాలిస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఇజాన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆ చిన్నారని హైదరాబాద్కు తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట బాబానగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.