బైక్ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-08-17T22:35:15+05:30 IST
బైక్ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి
సిద్దిపేట: జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు డ్రైవర్ పరారీలో వున్నాడు. మృతులు బత్తులవానిపల్లికి చెందిన లింగాల బాలయ్య, రాగటి రాజుగా గుర్తించారు. బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.