శ్రీధరరావు సమాచారం తెలిపితే పారితోషికం: పోలీసులు

ABN , First Publish Date - 2021-12-02T22:57:39+05:30 IST

సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. శ్రీధర్ రావు‌పై ఇప్పటికే నార్సింగ్, రాయదుర్గం, సనత్ నగర్‌లో కేసులు నమోదయ్యాయి.

శ్రీధరరావు సమాచారం తెలిపితే పారితోషికం: పోలీసులు

హైదరాబాద్: సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. శ్రీధర్ రావు‌పై ఇప్పటికే నార్సింగ్, రాయదుర్గం, సనత్ నగర్‌లో కేసులు నమోదయ్యాయి. మూడు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో తప్పించుకుని శ్రీధర్ రావు తిరుగుతున్నారు. శ్రీధర్ రావుపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు.  శ్రీధర్ రావు ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పత్రిక ప్రకటన విడుదల చేశారు. శ్రీధర్ రావు సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని పోలీసులు వెల్లడించారు. దేశం విడిచి ఎక్కడికి పారిపోకుండా లుకౌట్ నోటీసు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ టీమ్స్‌తో గాలిస్తున్నారు. 

Updated Date - 2021-12-02T22:57:39+05:30 IST