ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-07T01:27:05+05:30 IST

ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ మండలం గుండారానికి చెందిన షేక్ షాదుల్లా, మల్లెపల్లి వాసి మహ్మద్ ఇమ్రాన్, దారుగల్లీ వాసి...

ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కేసులో మరో ముగ్గురు అరెస్ట్

నిజామాబాద్: ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ మండలం గుండారానికి చెందిన షేక్ షాదుల్లా, మల్లెపల్లి వాసి మహ్మద్ ఇమ్రాన్, దారుగల్లీ వాసి మహ్మద్ అబ్దుల్ మొబిన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల నుంచి 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ నాగరాజు మాట్లాడారు. పీఎఫ్‌ఐ ప్రతినిధులుగా ముగ్గురు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముగ్గురూ కలిసి ఆటోనగర్‌లో అబ్దుల్ ఖాదర్ ఇంట్లో యువతకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. అమాయకులైన యువకులను చేరదీసి విచిన్నకర భావజాలం నేర్పుతున్నారని సీపీ తెలిపారు. 

Updated Date - 2022-07-07T01:27:05+05:30 IST