పేకాట స్థావరంపై పోలీసులు దాడి
ABN , First Publish Date - 2022-07-05T22:28:19+05:30 IST
జిల్లాలోని మిర్యాలగూడ మండలం కొత్తూరులో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ మండలం కొత్తూరులో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టయ్యారు. వారి నుంచి రూ.9 వేల నగదు, 4 బైక్లు, 4 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.