రాత్రి ఇంట్లో చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం
ABN , First Publish Date - 2022-08-14T12:49:31+05:30 IST
రాత్రి ఇంట్లో చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం
వనస్థలిపురం: చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న చుండి కోటేశ్వరరావు (33) తన ఎలక్ర్టిక్ బైక్ (మ్యాక్ కంపెనీ)కు శనివారం రాత్రి తన ఇంట్లో చార్జింగ్ పెట్టాడు. అయితే చార్జింగ్ను చెక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనంలోని బ్యాటరీ భారీ శ బ్దంతో పేలి మంటలు చెలరేగాయి. దీంతో కోటేశ్వర రావు ముఖం, చేతులు, ఛాతికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని వారు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది.