నాలుగు లక్షలకు చేరువలో మెట్రో
ABN , First Publish Date - 2022-08-10T13:35:16+05:30 IST
నాలుగు లక్షలకు చేరువలో మెట్రో
పెరుగుతున్న ప్రయాణికులు
హైదరాబాద్: నగరంలో మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నారు. మూడు నెలల క్రితం 2.50 లక్షల మార్కును దాటేందుకు ఆపసోపాలు పడిన మెట్రో తాజాగా నాలుగు లక్షల చేరువలోకి వెళ్లింది. త్వరలోనే కొవిడ్కు ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొవిడ్కు ముందు మూడు కారిడార్లలో రోజుకు సగటున 4.10 లక్షల నుంచి 4.30 లక్షల మంది వరకు రాకపోకలు సాగించేవారు.