బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-09T13:55:40+05:30 IST
బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆత్మహత్య
మియాపూర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. బీజేపీలో ఆర్ఎ్సఎస్ సభ్యుడి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఆయన మృతితో పలువురు నాయకులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. సోమవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ‘నన్ను ప్రశాంతంగా ఉండనియ్యండి.. ఎవరూ డిస్ట్రబ్ చేయవద్దు’ అని కుటుంబ సభ్యులకు చెప్పి పెంట్హౌ్సలోకి వెళ్లి గడియపెట్టుకుని ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. పని మనిషి, పీఏ సురేష్, కొంతమంది కార్యకర్తలు జ్ఞానేంద్రప్రసాద్ను కలిసేందుకు రాగా, ఎంత సేపటికీ తలుపు తీయలేదు. తలుపులు పగలగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్ఞానేంద్రప్రసాద్ కాలు తుంటి విరిగింది. చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మృతి చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు మానసిక ఒత్తిడి కారణమా, ఇతర ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.