నేటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపు
ABN , First Publish Date - 2022-04-04T12:18:18+05:30 IST
నేటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. రైతులంతా నిరసన దీక్షల్లో పాల్గొనాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈనెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నేతల నిరసన వ్యక్తం చేయనుంది.