ఢిల్లీకి వెళ్లే సీఎంకు.. ఇక్కడి ప్రజల నొప్పి తెలియడం లేదా?: ఎంపీ అర్వింద్
ABN , First Publish Date - 2022-07-25T22:38:32+05:30 IST
ఢిల్లీకి వెళ్లే సీఎంకు.. ఇక్కడి ప్రజల నొప్పి తెలియడం లేదా?: ఎంపీ అర్వింద్
ఆదిలాబాద్: భారీ వర్షాలతో రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా కట్టడంలో తెలంగాణ సర్కార్ విపలమైందని మండిపడ్డారు. ఫసల్ యోజనలో చేరితే పరిహారం వచ్చేదని సూచించారు. వరదలో బాధితులను పరామర్శించడంలోనూ సీఎం కేసీఆర్ విఫలమ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవి నొప్పికి, పంటి నొప్పికి పదే పదే డిల్లీకి వెళ్ళే కేసీఆర్కు ఇక్కడి ప్రజల నొప్పి కానరావడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాలు గాయంతో ఉన్న కేటీఅర్ ఏం సినిమాలు చూడాలని అడగటం సిగ్గుచేటన్నారు.