సత్యవతి రాథోడ్పై పరోక్షంగా మండిపడ్డ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-07-04T22:46:16+05:30 IST
సత్యవతి రాథోడ్పై పరోక్షంగా మండిపడ్డ ఎమ్మెల్యే
మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్పై పరోక్షంగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మండిపడ్డారు. శిశు, మహిళ సంక్షేమానికి సంబంధించిన విషయాలు తమకు తెలియడం లేదని ఎమ్మెల్యే రెడ్యా అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తప్పిదమో, మంత్రి తప్పిదమో... తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్యవతిపై రెడ్యానాయక్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.