వాహనంలో అటవీ పందులని బరిశలతో పొడిచి ఆటోలో తరలిస్తూ...

ABN , First Publish Date - 2022-07-24T21:22:37+05:30 IST

జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించారు.

వాహనంలో అటవీ పందులని బరిశలతో పొడిచి ఆటోలో తరలిస్తూ...

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. టాటా ఏసీ వాహనంలో అటవీ పందులని బరిశలతో పొడిచి ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులను రేంజ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-24T21:22:37+05:30 IST