ఒంటరిగా రోడ్డుపై నీళ్లు రావడం లేదని నిరసన

ABN , First Publish Date - 2022-06-24T17:32:06+05:30 IST

తమ వీధిలో మంచినీళ్లు రావడం లేదని, అధికారులకు చెప్పినా స్పందించటం లేదని ఓ వ్యక్తి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపాడు.

ఒంటరిగా రోడ్డుపై నీళ్లు రావడం లేదని నిరసన

మన్సూరాబాద్‌: తమ వీధిలో మంచినీళ్లు రావడం లేదని, అధికారులకు చెప్పినా స్పందించటం లేదని ఓ వ్యక్తి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపాడు. నాగోలు డివిజన్‌ చాణక్యపురి కాలనీలో ఉంటున్న యాదగిరి ఇంటితో పాటు ఆయన పరిసర ఇళ్లకు ఐదు రోజులుగా మంచినీళ్లు రావటం లేదు. జలమండలి సిబ్బందికి చెప్పినా పట్టించుకోవటం లేదని నిరసిస్తూ యాదగిరి గురువారం మధ్యాహ్నం ఒక్కడే రోడ్డుపై కూర్చొని ఇలా నిరసనను తెలియజేశాడు. పరిసర కాలనీవాసులందరూ అతనికి మద్దతు పలికారు. పైపులైను పగలడం వల్లే ఇబ్బంది తలెత్తిందని, శుక్రవారం నుంచి యథావిధిగా నీటి సరఫరా ఉంటుందని జలమండలి జీఎం వినోద్‌ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


Updated Date - 2022-06-24T17:32:06+05:30 IST