మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2021-12-15T21:46:07+05:30 IST
మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలించకుండా చూడాలని సీజే జస్టిస్ సతీష్చంద్రశర్మకు విద్యార్థులు లేఖ రాశారు. ఐటీఐ భూమిని కంపెనీలకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు పేర్కొన్నారు.
హైదరాబాద్: మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలించకుండా చూడాలని సీజే జస్టిస్ సతీష్చంద్రశర్మకు విద్యార్థులు లేఖ రాశారు. ఐటీఐ భూమిని కంపెనీలకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల లేఖను హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఐటీఐ తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని హైకోర్టు తెలిపింది. 8 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.