గాంధీ చిత్ర ప్రదర్శనపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-08-06T23:28:51+05:30 IST

"గాంధీ" చిత్ర ప్రదర్శనపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఉత్తర్వులు

గాంధీ చిత్ర ప్రదర్శనపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఉత్తర్వులు

హైదరాబాద్: "గాంధీ" చిత్ర ప్రదర్శనపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు "గాంధీ" చిత్రం ఉచిత ప్రదర్శన చేశారు. థియేటర్లు, మల్టీప్లెక్సుల్లోనూ "గాంధీ" చిత్రం ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 9 నుంచి 11 వరకు, 16 నుంచి 21 వరకు అన్ని థియేటర్లలో గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన వుంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు గాంధీ చిత్రం ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2022-08-06T23:28:51+05:30 IST