సూర్యాపేట: జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ
ABN , First Publish Date - 2022-08-07T00:20:03+05:30 IST
సూర్యాపేట: జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ
సూర్యాపేట: జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీలయ్యారు. సూర్యాపేట టౌన్ సీఐ ఆంజనేయులు వికారాబాద్ సీసీఎస్కు బదిలీ కాగా, సూర్యాపేట టౌన్ సీఐగా జి. రాజశేఖర్ను నియమించారు. సూర్యాపేట రూరల్ సీఐ విఠల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నాంపల్లి సీఐగా బదిలీ అయ్యారు. నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి నల్గొండ పీసీఆర్కు బదిలీ చేశారు. కోదాడ టౌన్ సీఐ నర్సింహా రావు నాగర్ కర్నూల్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. కోదాడ టౌన్ సీఐగా కె. శివశంకర్ ను నియమించారు.