రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం
ABN , First Publish Date - 2022-08-06T22:04:34+05:30 IST
రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్లో గోదాంపై రేకులు వేస్తుండగా కార్మికుడు జారిపడి మృతి చెందాడు. మృతుడు ఒడిషాకు చెందిన సుదర్శన్గా గుర్తించారు. మరో కార్మికుడు అనాంచరణ్ బెహర్కు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను గోప్యంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఉంచుతున్నట్లు సమాచారం.